బుమ్రా వచ్చాడు, టీమిండియా గెలిచింది... భారత బౌలింగ్ కష్టాలు తీరినట్టేనా...
First Published Sep 24, 2022, 2:19 PM ISTఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియా ఎక్కువగా మిస్ అయ్యింది జస్ప్రిత్ బుమ్రానే. బుమ్రా గాయం కారణంగా టోర్నీకి దూరం కావడం, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వకపోవడం టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపించింది. పాకిస్తాన్, శ్రీలంకలపై భారీ స్కోర్లు చేసినా ఆ లక్ష్యాలను కాపాడుకోలేక చిత్తుగా ఓడింది భారత జట్టు...