కాగా ఆసియా కప్ కోసం భారత్.. పాక్ కు రాకపోవడం గురించి పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘పాకిస్తాన్లో క్రికెట్ ఆడడానికి రాకపోతే ఇండియన్ క్రికెట్ టీమ్ నరకానికి వెళ్తుంది. పాక్ టీమ్ బతకడానికి టీమిండియా అవసరం లేదు. అయినా పాక్కి వస్తే ఎక్కడ ఓడిపోతామోనని వాళ్లు భయపడుతున్నారు. అందుకే ఫ్యాన్స్కి ముఖం చూపించలేమని భయపడి ఇక్కడికి రావడం లేదు..’ అంటూ వ్యాఖ్యానించాడు జావెద్ మియాందాద్.