అయితే గిల్ ఆట చూసి టీమిండియా ఫ్యాన్స్ అతడిని భారత క్రికెట్ లో సచిన్, కోహ్లీ తర్వాత ఆ స్థాయి ఆటగాడు అవుతాడని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఇదే విషయమై గుజరాత్ టైటాన్స్ మెంటార్, టీమిండియాకు 2011లో వన్డే వరల్డ్ కప్ అందించిన జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరించిన గ్యారీ కిర్స్టెన్ స్పందించాడు. గిల్ ను ఇప్పుడే ఆ దిగ్గజ క్రికెటర్లతో పోల్చడం సరికాదని అన్నాడు.