రాబోయే టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు తరఫున సారథి రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ బ్యాటింగ్ చేసేది ఎవరు...? అన్నదానిమీద భారత క్రికెట్ లో జోరుగా చర్చ జరుగుతున్నది. రోహిత్ తో కలిసి రెగ్యులర్ ఓపెనర్ రాహుల్ ను కాకుండా ఆసియా కప్ లో విజయవంతమైన విరాట్ కోహ్లీని బరిలోకి దించాలని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.