లంచ్ బ్రేక్ సమయానికి విరాట్ కోహ్లీ సెంచరీకి చేరువలో ఉండడంతో అతను సెంచరీ చేసుకునేదాకా బ్యాటింగ్ కొనసాగించాలని టీమిండియా అనుకుంది. 76 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ అవుట్ కాగానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలని అనుకున్నారు. అయితే తొలి టెస్టు ఆడుతున్న ఇషాన్ కిషన్కి బ్యాటింగ్ ఆడే అవకాశం రావాలని భావించిన రోహిత్ శర్మ, అతన్ని క్రీజులోకి పంపాడు..