కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అభ్యర్థనకు కూడా ఫ్రాంచైజీలు సరైన సహకారం అందించలేదని సమాచారం. అయినప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన 5 సంవత్సరాల తర్వాత ఆ ఆటగాళ్లను అన్క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో చేర్చడానికి బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ధోనీ ఆగస్టు 15, 2020న అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గత ఐపీఎల్ టోర్నీకి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ధోనీని రూ.12 కోట్లతో దక్కించుకుంది. టోర్నీ ప్రారంభానికి ముందే ధోనీ స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఐపీఎల్ 2024 సీజన్ లో చెన్నై జట్టుకు రితురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా నియమితుడయ్యాడు.
ధోనీ అన్క్యాప్డ్ ప్లేయర్ అయితే చెన్నైకి ఏం లాభం? ఇది మీకు ఆసక్తిగా అనిపించవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెటర్లను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంటే, వారు గరిష్టంగా 16 కోట్లు, కనిష్టంగా 8 కోట్లు చెల్లించాలి. అంటే రూ.4 కోట్ల తక్కువకు అన్ క్యాప్డ్ (అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడు)ని అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా, ధోనీ బ్రాండ్ విలువను, అలాగే వేలం కోసం తనపర్స్ ను మెరుగ్గా ఉంచాలని చెన్నై ఫ్రాంచైజీ యోచిస్తోంది. మరి చెన్నై ఫ్రాంచైజీ అభ్యర్థనను బీసీసీఐ అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాలి.