గతేడాదికి ముందు కూడా నేను ఇదే పరిస్థితుల్లో ఉన్నాను. సరిగ్గా అదే సమయంలో ఢిల్లీ నుంచి ఆర్సీబీకి వచ్చాను. వేలంలో నేను ఆర్సీబీకి ఎంపికయ్యాక నాకు అప్పటి సారథి విరాట్ కోహ్లి మెసేజ్ చేశాడు. ఏంటా అని నేను చూసుకునేసరికి.. ‘నువ్వు వచ్చే ఐపీఎల్ లో మా జట్టు తరఫున అన్ని మ్యాచులు ఆడబోతున్నావ్..’ అని ఉంది..