కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గత రెండేళ్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యంత ప్రమాదకరమైన జట్టుగా మారింది. ఈ జట్టు గత సీజన్లో విధ్వంసం సృష్టించింది. ఆ జట్టులోని ప్లేయర్లు సునామీ బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లలను దంచికొట్టారు.
గత సీజన్ లో ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఫామ్తో అదరిపోయే ఇన్నింగ్స్ లను ఆడాడు. హైదరాబాద్ టీమ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. కానీ ఐపీఎల్ 2025 సీజన్లో పెద్ద ఇన్నింగ్స్ లు రాలేదు. అలాగే, హైదరాబాద్ పరిస్థితి దారుణంగా మారింది. ప్రస్తుతం ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ 10వ స్థానంలో ఉంది.