ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయిన తర్వాత మొదట బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి మంచి ఆరంభం లభించింది. ఆర్సీబీ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ వచ్చిన వెంటనే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతను 32 పరుగులే చేసినా ఉన్నంత సేపు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే, స్టార్ విరాట్ కోహ్లీ కూడా 31 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు.
మూడో స్థానంలో వచ్చిన దేవదత్ పడిక్కల్ 14 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 27 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో స్థానంలో వచ్చిన రజత్ పాటిదార్ జట్టుకు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో 51 పరుగులు తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. చివరలో టిమ్ డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లతో ఆర్సీబీ 196 పరుగులు చేసింది.