ఐపీఎల్లో 10 టీమ్స్ వచ్చినప్పటి నుండి ప్లేఆఫ్స్ చేరాలంటే 16 పాయింట్లు మ్యాజిక్ నంబర్ గా మారాయి. 2022, 2023, 2025 సీజన్లలో 16 పాయింట్లు సాధించిన జట్లే నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ వెళ్లాయి. కేవలం 2024లో మాత్రమే 14 పాయింట్లు ఉన్న నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొనగా, మెరుగైన రన్ రేట్ ఉన్న ఆర్సీబీ క్వాలిఫై అయ్యింది.
కాబట్టి, ఈసారి కూడా 16 పాయింట్లు సాధిస్తేనే గ్యారెంటీ ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (10 పాయింట్లు), కోల్కతా నైట్ రైడర్స్ (9 పాయింట్లు) కూడా రేసులో ఉన్నప్పటికీ, వారి అవకాశాలు కేవలం 1.2% నుండి 11% మధ్యే ఉన్నాయి. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే టోర్నీ నుండి అవుట్ అయ్యాయి.