ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్లు మే 17న ప్రారంభమవుతాయి. అదే రోజున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)-కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య మ్యాచ్తో టోర్నీ తిరిగి మొదలవుతుంది. ఈ మ్యాచ్ ఆర్సీబీకి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకునే అవకాశం కాగా, కేకేఆర్ కోసం డూ ఆర్ డై తరహా పోరుగా మారనుంది.
ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ల ఆధారంగా, ఆర్సీబీ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ను వెనక్కి నెట్టేందుకు ఆర్సీబీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.