అలాగే, "ఆర్సీబీపై ఓడిపోవడంతో అతను నాయకుడిగా కష్టపడుతున్నాడు. అయినప్పటికీ, అతను పరిపక్వతను చూపించాడు. మంచి నిర్ణయాలు తీసుకోవడం కనిపించింది. కెప్టెన్ గా బాగా పనిచేయడంతో పాటు మంచి బ్యాటింగ్ తో రాణించాడు" అని సురేశ్ రైనా స్పోర్ట్స్ టాక్తో అన్నారు.
ఐపీఎల్ 2025 కి ముందు మెగా వేలం జరగనుంది. దీని కోసం ఇప్పటికే బీసీసీఐ సిద్ధమవుతోంది. కొత్త నిర్ణయాలు, మార్పులు, రూల్స్ విషయంలో ఇప్పటికే పలుమార్లు ఐపీఎల్ ఫ్రాంఛైజీలతో చర్చలు జరిపింది. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు ధోని విషయంలో కీలకంగా మారనున్నాయి. కాగా, గత సీజన్ లో (ఐపీఎల్ 2024) లో ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశాలు పెద్దగా రాలేదు. ప్లేయర్ గా 73 బంతుల్లో 161 పరుగులతో చేశాడు.