గుజరాత్ టీమ్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ప్రారంభించింది కానీ, మ్యాచ్ లో చివరి ఓవర్ వరకు గెలుపు కోసం ఫైట్ చేసింది. కానీ, విజయాన్ని అందుకోలేకపోయింది. పంజాబ్ కింగ్స్ (PBKS) 2025 ఐపీఎల్ సీజన్లో తన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (GT) పై 11 పరుగులతో ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించింది. గుజరాత్ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ ధనాధన్ ఇన్నింగ్స్ తో 41 బంతుల్లో 74 పరుగులు ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. గిల్ 33, జోస్ బట్లర్ 54, రూథర్ ఫర్డ్ 46 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు.
తన బ్యాటర్ల విధ్వంసంతో పంజాబ్ టీమ్ ఐపీఎల్ లో తన రెండో అత్యధిక టీమ్ స్కోర్ ను నమోదుచేసింది.
IPLలో PBKS కి అత్యధిక స్కోరు
262/2 vs KKR, కోల్కతా, 2024
243/5 vs GT, అహ్మదాబాద్, 2025
232/2 vs RCB, ధర్మశాల, 2011
231/4 vs CSK, కటక్, 2014
230/3 vs MI, వాంఖడే, 2017
అలాగే, గుజరాత్ టీమ్ గత సిక్సర్ల రికార్డును అధిగమించింది. ఐపీఎల్ 2023లో అహ్మదాబాద్ లో ఎల్ఎస్జీపై జీటీ 14 సిక్సర్ల రికార్డును అధిగమిస్తూ పంజాబ్ టీమ్ పై 16 సిక్సర్లు కొట్టింది. 2023తో ముంబై ఇండియన్స్ పై చేసిన 233/3 అత్యధిక పరుగుల తర్వాత ఇప్పుడు 232/5 పరుగులతో రెండో అత్యధిక స్కోర్ ను నమోదుచేసింది.