ఐపీఎల్ 2025 కోసం చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్ల లిస్టులో రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివమ్ దుబే, మతీషా పతిరానాలను రిటైన్ చేసుకుంది. వీరితో పాటు లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోనిని కూడా రిటైన్ చేసుకుంది. అయితే, అన్క్యాప్డ్ ప్లేయర్ రిటెన్షన్ రూల్ను చెన్నై సూపర్ కింగ్స్ పూర్తిగా ఉపయోగించుకోవడంతో 43 ఏళ్ల ధోనీని రూ.4 కోట్లకు అట్టిపెట్టుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్లు వీరే
రుతురాజ్ గైక్వాడ్ (క్యాప్డ్) - రూ. 18 కోట్లు
రవీంద్ర జడేజా (క్యాప్డ్) - రూ. 18 కోట్లు
మతీషా పతిరణ (క్యాప్డ్, ఓవర్సీస్) – రూ. 13 కోట్లు
శివమ్ దూబే (క్యాప్డ్) - రూ. 12 కోట్లు
ఎంఎస్ ధోని (అన్క్యాప్డ్) - రూ. 4 కోట్లు