దేశవాళీలో అవకాశాలు లేక.. తమ ప్రతిభను ఎవరూ గుర్తించడం లేదని మగ్గిపోయిన చాలా మంది యువ క్రికెటర్లకు ఐపీఎల్ ఒక అద్భుత వేదికైంది. బార్బర్ పనిచేసే ఒక వ్యక్తి కొడుకు రాజస్తాన్ రాయల్స్ లో బౌలర్ (కుల్దీప్ సేన్) గా ఎదిగాడు. పానీ పూరీ అమ్ముకునే తండ్రిని.. ‘నా కొడుకు యశస్వి జైస్వాల్’ అని ఘనంగా చేసిందీ ఐపీఎల్ అనడంలో సందేహం లేదు. స్వీపర్ పని చేసి రోజు గడవడమే కష్టంగా ఉందన్న రింకూ సింగ్ ను ఓవర్ నైట్ స్టార్ చేసిందీ ఈ లీగే..