ఇక కేకేఆర్ కు రెండు ఐపీఎల్ ట్రోఫీలను అందించిన గౌతం గంభీర్ కూడా మ్యాచ్ ముగిశాక రింకూ, నితీశ్ రాణా, సుయాశ్ శర్మలతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను ట్విటర్ లో షేర్ చేస్తూ.. ‘ఇవాళ రింకూ సింగ్ అద్భుతంగా పోరాడాడు. సెన్సేషనల్ టాలెంట్..’అని ట్వీట్ చేశాడు.