ఆఖరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 19 పరుగులు కావాల్సి వచ్చాయి.. 6 బంతుల్లో 3 సిక్సర్లు కొడితే చాలు. అయితే మతీశ పథిరాణా కేవలం 10 పరుగులే ఇవ్వడంతో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో ఓడింది. గ్లెన్ మ్యాక్స్వెల్ 36 బంతుల్లో 76, ఫాఫ్ డుప్లిసిస్ 33 బంతుల్లో 62 పరుగులు చేసి మూడో వికెట్కి 126 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించినా విజయం మాత్రం అందించలేకపోయారు..