లక్ష్య ఛేదనలో కేకేఆర్.. 29 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయినా నితీశ్ రాణా (34), వెంకటేశ్ అయ్యర్ (34), ఆండ్రూ రసెల్ (35) లు ఆదుకోవడంతో 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో మూడు ఓవర్లు వేసి 19 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసిన అర్ష్దీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.