ఐపీఎల్ -16లో జైస్వాల్ ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడి 428 పరుగులు సాధించి ప్రస్తుతానికి సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. బ్యాటింగ్ లో టెక్నిక్, దూకుడు, ఎంతటి బౌలర్ అయినా బెదురులేకుండా ఎదుర్కునే మనస్తత్వంతో ఉన్న యశస్వి నిలకడగా రాణిస్తున్నాడు. టీ20లలో ప్రపంచంలోనే తోపు అనదగ్గ జోస్ బట్లర్ కూడా యశస్వి ముందు తేలిపోతున్నాడంటే జైస్వాల్ ఏ రేంజ్ లో చెలరేగుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.