తాజాగా తేలిన లెక్కల ప్రకారం ఐపీఎల్ 2023 సీజన్ సమయంలో కేవలం ప్రకటనల ద్వారానే రూ.10,120 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి వయాకాం, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్. ఐదేళ్లకు 2023-27 వరకూ రూ.48,390 కోట్లు పెట్టి ప్రసార హక్కులను కొనుగోలు చేసిన సంస్థలకు తొలి సీజన్లోనే 25 శాతానికి పైగా (వేలం లైవ్తో కలుపుకుని) రిటర్న్ వచ్చేసింది..