కాగా మ్యాచ్ తర్వాత అశ్విన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా మాట్లాడని ఆరోపిస్తూ అశ్విన్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్టు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ఒక ప్రకటనలో తెలిపాడు. ఐపీఎల్ రూల్స్ ఆర్టికల్ 2.7 ప్రకారం.. మ్యాచ్ జరిగినప్పుడు అందులో జరిగిన సంఘటనలు, ఆటగాళ్లు, అంపైర్ల గురించి గానీ బహిరంగంగా విమర్శలు చేస్తే అది నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుంది.