ఇప్పటికే గంభీర్, గంగూలీ, నవీన్ లతో గొడవతో కోహ్లీ ఇమేజ్ డ్యామేజ్ అయిన నేపథ్యంలో ఆందోళనగా ఉన్న విరాట్ ఫ్యాన్స్ కు ఇది మరింత ఆగ్రహం తెప్పించింది. నవీన్ ను టార్గెట్ చేస్తూ.. ‘నిన్న గాక మొన్నొచ్చిన నీకే ఇంతుంటే 15 ఏండ్లుగా క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న మా కోహ్లీకి ఎంతుండాలి..?’, ‘నవీనూ.. ఎగిరెగిరి పడకు. నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నావ్ నువ్వు. ఆగస్టులో ఇండియా -ఆఫ్గాన్ సిరీస్ ఉంది కదా. నీకు అప్పుడుంది..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై కోహ్లీ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.