ఇక లక్నో - బెంగళూరు మ్యాచ్ లో అయితే కోహ్లీ .. నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా, గౌతం గంభీర్ వంటి వాళ్లతో గిచ్చి మరీ కయ్యం పెట్టుకున్నాడు. ఇది కోహ్లీ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసింది. అంత పెద్ద ప్లేయర్ అయి ఉండి ఎదుటి ఆటగాళ్లపై ఇలా వ్యవహరించడం సరికాదన్న విమర్శలు వినిపించాయి. ఇదే క్రమంలో ఢిల్లీ - బెంగళూరు మ్యాచ్ లో కోహ్లీ ఇంకెంత రచ్చ చేస్తాడోనని అతడి అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ ఒకటే ఆందోళన.