కాగా 2013 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన మోహిత్ శర్మ, ఆ సీజన్లో 15 మ్యాచుల్లో 20 వికెట్లు తీశాడు. ఆ తర్వాతి సీజన్లో 16 మ్యాచులు ఆడి 23 వికెట్లు పడగొట్టాడు. 2021 వేలంలో అమ్ముడుపోని మోహిత్ శర్మ, 2022 ఐపీఎల్ సమంలో గుజరాత్ టైటాన్స్ టీమ్లో నెట్ బౌలర్గా చేరాడు. అతని పర్ఫామెన్స్ నచ్చడంతో టీమ్లోకి తీసుకున్న గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో అతన్ని తుది జట్టులో ఆడిస్తున్నది. పంజాబ్ తో మ్యాచ్ లో కూడా 4 ఓవర్లు వేసి 18 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.