IPL 2023: ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా వ్యవహరిస్తున్న కెఎల్ రాహుల్ మరో ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజ బ్యాటర్లను అధిగమించాడు.
టీమిండియా వెటరన్ స్టార్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ సారథి కెఎల్ రాహుల్ ఈ ఫార్మాట్ లో మరో ఘనతను అందుకున్నాడు. టీ20లలో అత్యంత వేగంగా 7 వేల పరుగుల క్లబ్ లో చేరిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్ లు కూడా అతడి తర్వాతే ఉన్నారు.
26
గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో భాగంగా 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్.. 7 వేల పరుగుల మైలురాయిని అందుకన్నాడు. ఈ రికార్డు చేరుకోవడానికి అతడికి 197 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి.
36
ఈ జాబితాలో కొద్దిసేపటిక్రితం వరకు విరాట్ కోహ్లీ.. అందరికంటే ముందుండేవాడు. కోహ్లీ .. 212 ఇన్నింగ్స్ లలో ఏడు వేల పరుగుల మైలురాయిని చేరాడు. తాజాగా రాహుల్ ఆ రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం.
46
కెఎల్ రాహుల్, కోహ్లీల తర్వాత శిఖర్ ధావన్ (246 ఇన్నింగ్స్), సురేశ్ రైనా (251 ఇన్నింగ్స్) ఉండగా భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ.. 258 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించాడు.
56
Image credit: PTI
కాగా ఇటీవలే రాహుల్.. ఐపీఎల్ లో అత్యంత వేగంగా 4 వేల పరుగుల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్ తో శనివారం ముగిసిన మ్యాచ్ లో రాహుల్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో రాహుల్ తన వ్యక్తిగత స్కోరు 30 పరుగులు దాటగానే ఐపీఎల్ లో 105 ఇన్నింగ్స్ లలోనే 4 వేల పరుగులు దాటిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
66
Image credit: RCB/Facebook
రాహుల్ కంటే ముందు ఈ ఘనత సాధించినవారిలో క్రిస్ గేల్ ముందున్నాడు. గేల్.. 112 ఇన్నింగ్స్ లలో 4 వేల పరుగుల మైలురాయిని అందుకోగా డేవిడ్ వార్నర్ 114 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించాడు. ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ.. 128 ఇన్నింగ్స్ లలో 4 వేల పరుగుల క్లబ్ లో చేరగా.. ఏబీ డివిలియర్స్.. 131 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను అందుకున్నాడు.