జడ్డూ నాకు ఫినిషింగ్ ఛాన్స్ ఇచ్చాడు! కానీ నా వల్ల కాలేదు అయినా హ్యాపీయే... మహేంద్ర సింగ్ ధోనీ కామెంట్...

Published : Apr 13, 2023, 09:33 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో ఓడినా ఆ తర్వాత వరుసగా రెండింట్లో విజయాలు అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నైకి షాక్ తగిలింది. ఆఖరి ఓవర్‌ ఆఖరి బంతి వరకూ పోరాడిన సీఎస్‌కే, 3 పరుగుల తేడాతో ఓడింది...

PREV
15
జడ్డూ నాకు ఫినిషింగ్ ఛాన్స్ ఇచ్చాడు! కానీ నా వల్ల కాలేదు అయినా హ్యాపీయే... మహేంద్ర సింగ్ ధోనీ కామెంట్...

ఆఖరి ఓవర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 21 పరుగులు కావాల్సి వచ్చాయి. మొదటి 3 బంతుల్లో 2 వైడ్లు, 2 సిక్సర్లు కొట్డంతో 13 పరుగులు వచ్చేశాయి. క్రీజులో క్రికెట్‌లో బెస్ట్ ఫినిషర్‌గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా ఉన్నారు... ధోనీ ఆఖరి ఓవర్‌లో మొదటి 3 బంతుల్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు...
 

25
PTI Photo/R Senthil Kumar)(PTI04_12_2023_000216B)

చివరి 3 బంతుల్లో ఒక్క సిక్సర్ బాదితే చాలు, మ్యాచ్ టై అయిపోయింది. మిగిలిన 2 బంతుల్లో ఒక్క సింగిల్ తీసినా సీఎస్‌కేదే విజయం. ఎప్పటిలాగే మహేంద్ర సింగ్ ధోనీ మ్యాచ్‌ని ముగించేస్తాడని అనుకున్నారంతా. కానీ సందీప్ శర్మ చివరి 3 బంతుల్లో మ్యాజిక్ చేశాడు...

35

3 బంతుల్లో 3 సింగిల్స్ మాత్రమే వచ్చాయి. ఈ మ్యాచ్‌పై మహేంద్ర సింగ్ ధోనీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మిడిల్ ఓవర్లలో కావాల్సినన్ని పరుగులు రాలేదు. పిచ్ చాలా బాగుంది. అయితే వాళ్ల టీమ్‌లో అశ్విన్, యజ్వేంద్ర చాహాల్ వంటి సీనియర్ స్పిన్నర్లు ఉన్నారు.. 
 

45
(PTI Photo/R Senthil Kumar)(PTI04_03_2023_000329B)

ఆఖరి ఓవర్‌లో మ్యాచ్‌ని ఫినిష్ చేయగలమనే అనుకున్నాం. నేను జడేజా సిక్సర్‌తో ఫినిష్ చేస్తాడని అనుకున్నా. అతనేమో నాకే ఫినిషింగ్ ఛాన్స్ ఇచ్చాడు. సందీప్ శర్మ బాగా బౌలింగ్ చేశాడు. నేను స్ట్రైయిట్ సిక్సర్ కొడదామని అనుకున్నా కానీ అతను నాకు ఆ అవకాశం ఇవ్వలేదు..

55
Image credit: PTI

ఈ మ్యాచ్‌లో ఓడినా ఆఖరి ఓవర్ వరకూ పోరాడాం. 3 పరుగుల తేడాతో ఓడినా మాకు నెట్ రన్ రేట్ కలిసి వస్తుంది. చివరి వరకూ 100 శాతం ప్రయత్నించాం. అది మాకు సంతృప్తిని ఇచ్చింది..’ అంటూ కామెంట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. 

click me!

Recommended Stories