అయితే అక్కడ ముంబైకి మంట పెట్టిన వరుణుడు, ఈసారి ఆ టీమ్కి సాయం చేసే అవకాశం ఉంది. బెంగళూరులో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కి వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియచేసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఫలితం తేలకపోతే సన్రైజర్స్పై గెలిస్తే చాలు, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరుకుంటుంది..