ఐపీఎల్ లో ఫ్రాంచైజీలకు లంక క్రికెటర్లు శుభవార్త చెప్పారు. ఐపీఎల్ లో పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న నలుగురు ఆటగాళ్లు నేడో రేపో వారి టీమ్స్ తో కలవనున్నారు. గత నెలరోజులుగా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక.. టెస్టు,వన్డే, టీ20 సిరీస్ లను ముగించుకుంది. దీంతో ఆ జట్టులో ఉన్న టీ20 వీరులు కివీస్ నుంచి నేరుగా ఇండియాకు పయనమయ్యారు.