ఐపీఎల్ 2023 సీజన్లో స్లో ఓవర్ కారణంగా ఇప్పటికే ఆర్సీబీ కెప్టెన్లు ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ ఫైన్లు కట్టారు. మొదటి తప్పిదంగా ఫాఫ్ డుప్లిసిస్కి రూ.12 లక్షల ఫైన్ వేసి వదిలేసిన ఐపీఎల్ మేనేజ్మెంట్, తాత్కాలిక సారథిగా వ్యవహరించిన విరాట్ కోహ్లీ కూడా స్లో ఓవర్ రేటును కొనసాగించడంతో 24 లక్షల మ్యాచ్ ఫీజును కోత వేసింది... టీమ్ ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కత్తిరించింది.