ఈ క్రమంలో నికోలస్ పూరన్ క్రీజులోకి వచ్చాడు. ఇక ఇప్పుడు బాదడం పూరన్ వంతు. నాలుగు, ఐదు, ఆరు బంతులు స్టాండ్స్ లో పడ్డాయి. ఒక్క ఓవర్ పుణ్యమా అని లక్నో స్కోరు ఏకంగా 145-3కి మారింది. ఈ ఓవర్ తర్వాత సమీకరణం 24 బంతుల్లో 38 గా మారింది. చివర్లో నటరాజన్ , భువనేశ్వర్ కాస్త కట్టడి చేయడానికి యత్నించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.