సెహ్వాగ్ మాట్లాడుతూ.. ఒకవేళ పాండ్యా బౌలింగ్ చేయకుంటే ముంబై ఇండియన్స్ అతడిని కొనుగోలు చేసే సాహసం చేయకపోవచ్చునని తెలిపాడు. పాండ్యా ఫామ్, ఫిట్నెస్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ముంబై.. 2022 మెగా ఆక్షన్ లో అతడిని మళ్లీ కొనే అవకాశాలు లేవని వ్యాఖ్యానించాడు. తానైతే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా వంటి వాళ్లనే తీసుకుంటానని చెప్పాడు.