త్వరలో ఐపీఎల్ 2021 వేలం... ఒకటి కాదు, ఏకంగా రెండు జట్లు న్యూ ఎంట్రీ... మ్యాచులు కూడా!

Published : Nov 12, 2020, 12:19 PM IST

2020 ఐపీఎల్ సీజన్ గ్రాండ్ సక్సెస్ సాధించింది. కరోనా పరిస్థితులను ఎదురొడ్డి, బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించిన తీరు అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అయితే వచ్చే ఏడాది లీగ్‌లో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తోంది బీసీసీఐ. ఇందుకోసం ఇప్పటి నుంచే కావాల్సిన ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి.

PREV
110
త్వరలో ఐపీఎల్ 2021 వేలం... ఒకటి కాదు, ఏకంగా రెండు జట్లు న్యూ ఎంట్రీ... మ్యాచులు కూడా!

షెడ్యూల్ ప్రకారం యథావిథిగా వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 14 నిర్వహించబోతోంది బీసీసీఐ...

షెడ్యూల్ ప్రకారం యథావిథిగా వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 14 నిర్వహించబోతోంది బీసీసీఐ...

210

ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా కూడా ఖరారు చేశాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. స్వదేశంలో జరగబోయే ఈ టోర్నీకి జనాలకు కూడా అనుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది బీసీసీఐ.

ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా కూడా ఖరారు చేశాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. స్వదేశంలో జరగబోయే ఈ టోర్నీకి జనాలకు కూడా అనుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది బీసీసీఐ.

310

2020 సీజన్‌పై కరోనా ఎఫెక్ట్ కారణంగా కలిగిన నష్టాన్ని రెట్టింపు లాభంతో పూడ్చుకోవాలని ప్రయత్నిస్తోంది బీసీసఐ. ఇందుకోసం వచ్చే సీజన్‌లో చాలా మార్పులు చేయబోతోంది.

2020 సీజన్‌పై కరోనా ఎఫెక్ట్ కారణంగా కలిగిన నష్టాన్ని రెట్టింపు లాభంతో పూడ్చుకోవాలని ప్రయత్నిస్తోంది బీసీసఐ. ఇందుకోసం వచ్చే సీజన్‌లో చాలా మార్పులు చేయబోతోంది.

410

2021 సీజన్‌లో కొత్త రెండు జట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మొదటి ఒక జట్టును అదనంగా చేరుస్తారని వార్తలు వచ్చినా, రెండు జట్లను చేరిస్తే ప్లేఆఫ్స్ విషయంలో క్లారిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఆ సంఖ్యను 10కి పెంచినట్టు సమాచారం.

2021 సీజన్‌లో కొత్త రెండు జట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మొదటి ఒక జట్టును అదనంగా చేరుస్తారని వార్తలు వచ్చినా, రెండు జట్లను చేరిస్తే ప్లేఆఫ్స్ విషయంలో క్లారిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఆ సంఖ్యను 10కి పెంచినట్టు సమాచారం.

510

అహ్మదాబాద్ నగరంతో ఒక ఫ్రాంఛైజీ రాబోతుండగా... కేరళ కేంద్రంగా మరో ఫ్రాంఛైజీ రాబోతుందని సమాచారం. మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఓ ఫ్రాంఛైజీ కొనుగోలుకి ఆసక్తిగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అహ్మదాబాద్ నగరంతో ఒక ఫ్రాంఛైజీ రాబోతుండగా... కేరళ కేంద్రంగా మరో ఫ్రాంఛైజీ రాబోతుందని సమాచారం. మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఓ ఫ్రాంఛైజీ కొనుగోలుకి ఆసక్తిగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

610

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా అహ్మదాబాద్‌లో సర్దార్ పటేల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం పూర్తి కావోస్తోంది. దీని పూర్తి కెపాసిటీ లక్షా 10 వేల మంది...

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా అహ్మదాబాద్‌లో సర్దార్ పటేల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం పూర్తి కావోస్తోంది. దీని పూర్తి కెపాసిటీ లక్షా 10 వేల మంది...

710

ఈ సీజన్‌లో 60 మ్యాచులు నిర్వహించగా వచ్చే ఏడాది రెండు కొత్త జట్లు చేరుతుండడంతో మొత్తంగా 76 మ్యాచులు జరుగుతాయని సమాచారం... 

ఈ సీజన్‌లో 60 మ్యాచులు నిర్వహించగా వచ్చే ఏడాది రెండు కొత్త జట్లు చేరుతుండడంతో మొత్తంగా 76 మ్యాచులు జరుగుతాయని సమాచారం... 

810

ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించిన వేలాన్ని వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోతున్నారు... 2011 సీజన్‌లో మొత్తంగా 10 జట్లు పాల్గొన్నాయి. పూణే వారియర్స్ ఇండియా, కొచ్చి టస్కర్స్ కేరళ జట్లు అదనపు జట్లుగా చేరాయి.

ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించిన వేలాన్ని వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోతున్నారు... 2011 సీజన్‌లో మొత్తంగా 10 జట్లు పాల్గొన్నాయి. పూణే వారియర్స్ ఇండియా, కొచ్చి టస్కర్స్ కేరళ జట్లు అదనపు జట్లుగా చేరాయి.

910

అయితే కొచ్చి టస్కర్స్ కేరళ ఒకే సీజన్‌కి పరిమితం కాగా పూణే వారియర్స్ మూడు సీజన్ల తర్వాత రద్దయ్యింది. ఇప్పుడు మళ్లీ 10 జట్లతో లీగ్ ప్రారంభం కానుంది.

అయితే కొచ్చి టస్కర్స్ కేరళ ఒకే సీజన్‌కి పరిమితం కాగా పూణే వారియర్స్ మూడు సీజన్ల తర్వాత రద్దయ్యింది. ఇప్పుడు మళ్లీ 10 జట్లతో లీగ్ ప్రారంభం కానుంది.

1010

నిజానికి 2023 సీజన్ నుంచి ఐపీఎల్‌ను 10 జట్లతో భారీగా పెంచాలని భావించింది బీసీసీఐ... అయితే కరోనా ఎఫెక్ట్‌తో ఆ ఆలోచనను ముందుగా అమలులోకి తేవాలని ప్రయత్నాలు చేస్తోంది.
 

నిజానికి 2023 సీజన్ నుంచి ఐపీఎల్‌ను 10 జట్లతో భారీగా పెంచాలని భావించింది బీసీసీఐ... అయితే కరోనా ఎఫెక్ట్‌తో ఆ ఆలోచనను ముందుగా అమలులోకి తేవాలని ప్రయత్నాలు చేస్తోంది.
 

click me!

Recommended Stories