IPL 2020: బాబాగా మారిన వీరేంద్ర సెహ్వాగ్... ట్రంప్‌ను కాపాడతానంటూ..

First Published Oct 2, 2020, 5:59 PM IST

PL 2020 సీజన్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మెజారిటీ మ్యాచులు నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠభరితంగా సాగుతూ ఐపీఎల్ అభిమానులకు కావాల్సినంత కిక్‌ను అందిస్తున్నాయి. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌కి దూరంగా ఉన్నాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. 

గత మూడు సీజన్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి మెంటర్‌గా వ్యవహారించిన వీరూ... ఈ సారి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
undefined
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లను ఇంట్లో నుంచే వీక్షిస్తున్నాడు.
undefined

Latest Videos


మ్యాచ్‌లపై తన విశ్లేషణలను వీడియోల రూపంలో అందిస్తూ, క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు.
undefined
తాజాగా బాబా అవతారం ఎత్తాడు వీరేంద్ర సెహ్వాగ్.
undefined
కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను రక్షించేందుకు వీరూ బాబా ఆశీర్వాదాలు ఉంటాయంటూ తన ఫోటోను పోస్టు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.
undefined
ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించిన వీరేంద్ర సెహ్వాగ్, ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకి ఆడాడు...
undefined
క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత పంజాబ్ జట్టుకి మెంటర్‌గా కూడా వ్యవహారిస్తూ వచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్.
undefined
వీరూ తప్పుకోవడంతో ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి మెంటర్‌గా వ్యవహారిస్తున్నాడు అనిల్ కుంబ్లే...
undefined
click me!