IPL 2020: ఆటగాడిని కలిసిన బుకీ... ఐపీఎల్‌లో ఫిక్సింగ్ కలకలం!

First Published Oct 4, 2020, 6:31 PM IST

ఐపీఎల్ 2020ని కూడా ఫిక్సింగ్ కలకలం వదలడం లేదు. కరోనా వైరస్ కారణంగా ఖండాతరాలు దాటి యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్‌పై బుకీల కన్ను పడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

బయో బబుల్ పరిధిలో జరుగుతున్న ఐపీఎల్ తాజా సీజన్ ఆడుతున్న ఓ క్రికెటర్‌ను ఫిక్సింగ్ కోసం కలిశాడో బుకీ.
undefined
అయితే వెంటనే ఆ క్రికెటర్ బీసీసీఐ అధికారులకు తెలియచేశాడు.
undefined
అతని నుంచి సమాచారం సేకరించిన అధికారులు, విచారణ మొదలెట్టారు.
undefined
యూఏఈలో క్రికెటర్లు ఉన్న ప్రదేశంలోకి ఇతరులకు ప్రవేశం లేదు.
undefined
బబుల్ దాటి బయటికి వెళ్లేందుకు క్రికెటర్లకు అనుమతి లేదు.
undefined
దాంతో బయటివ్యక్తులు క్రికెటర్లను కలవడం అసాధ్యమని భావించారు అధికారులు.
undefined
అయితే వారి నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి.
undefined
ఆటగాడిని సంప్రదించిన బుకీని పట్టుకునేందుకు కొంత సమయం పడుతుందని తెలిపింది బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ.
undefined
నిబంధనల ప్రకారం బుకీ వివరాలు తెలిపిన సదరు క్రికెటర్ పేరు మాత్రం వెల్లడించలేదు.
undefined
మొదటి సీజన్ నుంచి ఇప్పటిదాకా 13 సీజన్లలో కొన్నిసార్లు ఐపీఎల్‌‌పై ఫిక్సింగ్ ఆరోపణలు రావడం, శ్రీశాంత్ లాంటికొందరు ప్లేయర్లపై నిషేధం కూడా పడిన సంగతి తెలిసిందే.
undefined
click me!