IPL 2020 Final: ఈ సీజన్‌లో టైటిల్ గెలిచేది ఢిల్లీయే... మాజీ క్రికెటర్ జోస్యం!

First Published Nov 10, 2020, 6:26 PM IST

IPL 2020 సీజన్‌లో మొట్టమొదటిసారి ఫైనల్‌లోకి ప్రవేశించింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే ఫైనల్ ఫైట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలబడుతోంది ఢిల్లీ. ఇప్పటికే ముంబై చేతుల్లో మూడు సార్లు చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్... ఫైనల్ మ్యాచ్‌లో ఏ రేంజ్‌లో పోటీనిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్.

పటిష్ట ముంబై ఇండియన్స్‌ను ఓడించడం యంగ్ టీమ్‌కి చాలా పెద్ద ఛాలెంజ్. క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు కూడా ముంబై ఐదో టైటిల్ ఈజీగా గెలుస్తుందని అంచనా వేస్తున్నారు.
undefined
అయితే 2020 సీజన్‌లో టైటిల్‌ గెలిచేది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టేనని అంటున్నాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...
undefined
గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన మార్కస్ స్టోయినిస్, మొదటి వికెట్‌కి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. శిఖర్ ధావన్‌తో కలిసి 80+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన స్టోయినిస్, ఢిల్లీ భారీ స్కోరు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు.
undefined
అయితే ఫైనల్ మ్యాచ్‌లో స్టోయినిస్‌ను ఓపెనర్‌గా పంపడం కంటే సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింకా రహానేతో ఓపెనింగ్ చేయించాలని అంటున్నాడు ఆకాశ్ చోప్రా...
undefined
‘కొత్త బంతిని ఎదుర్కోవడంలో స్టోయినిస్ బాగా ఇబ్బంది పడుతున్నాడు. ముంబై టీమ్‌లో ఉన్న బుమ్రా, బౌల్ట్, ప్యాటిన్సన్ వంటి పేసర్లను ఎదుర్కోవడం స్టోయినిస్‌కి చాలా కష్టం కావచ్చు...
undefined
గత మ్యాచ్‌లో రాణించినా స్టోయినిస్‌ను కొనసాగించే కంటే సీనియర్ ఓపెనర్‌కి ఛాన్స్ ఇస్తేనే బెటర్... ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ గెలవాలంటే గబ్బర్ బ్యాటు నుంచి అదిరిపోయే ఇన్నింగ్స్ రావాల్సిందే...
undefined
శిఖర్ ధావన్ బాగా ఆడిన ప్రతీ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కలిసొచ్చింది. ముంబై జరిగిన గత రెండు మ్యాచుల్లో ధావన్ డకౌట్ కావడం ఢిల్లీ ఓటమికి కారణం. ధావన్ ఈ విషయాన్ని గుర్తు ఉంచుకుని బాధ్యతగా బ్యాటింగ్ చేయాలి...
undefined
ఫైనల్ ఫైట్‌ను ముంబై ఇండియన్స్‌ను ఓడించాలంటే ధావన్, రహానే వంటి ఒకరిద్దరు రాణిస్తే సరిపోదు... కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్,రిషబ్ పంత్, స్టోయినిస్, హెట్మయర్ బ్యాట్ల నుంచి భారీ షాట్లు రావాలి...
undefined
బౌలింగ్‌లో రబాడాకి నోకియా, అశ్విన్, అక్షర్ పటేల్ సపోర్ట్ ఇవ్వాలి... అశ్విన్ రాణిస్తే ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేయడం తేలికవుతుంది... ’ అని చెప్పుకొచ్చాడు ఆకాశ్ చోప్రా.
undefined
సచిన్ టెండూల్కర్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్ దాకా చాలామంది మాజీ క్రికెటర్లు ముంబై ఇండియన్స్ ఐదో టైటిల్స్ గెలుస్తుందని అంచనా వేస్తుంటే ఆకాశ్ చోప్రా మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఓటు వేశాడు.
undefined
click me!