ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ.. వన్డేలలో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో ఐదో స్థానంలో ఉన్న మహేళ జయవర్దెనే రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్ కు ముందు కోహ్లీ.. వన్డేలలో 267 మ్యాచ్ లు ఆడి 258 ఇన్నింగ్స్ లలో 12,588 పరుగులు సాధించాడు. కానీ నేటి మ్యాచ్ లో 166 పరుగులు చేయడంతో అతడు 12,659 పరుగులకు చేరాడు. తద్వారా జయవర్దెనే పేరిట ఉన్న 267 మ్యాచ్ లు ఆడి 258 ఇన్నింగ్స్ లలో 12,588 పరుగుల రికార్డు చెరిగిపోయింది. కోహ్లీ కంటే ముందు టెండూల్కర్, సంగక్కర, పాంటింగ్, జయసూర్య ఉన్నారు.