టీమిండియా తరుపున 113 వన్డే మ్యాచులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్, 151 వికెట్లు పడగొట్టాడు. కోహ్లీ కెప్టెన్సీలో 2017 జూన్లో చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడిన అశ్విన్, 10 ఓవర్లలో 3 వికెట్లు తీసి కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు... ఆ తర్వాత టీమ్లో చోటు కోల్పోయిన అశ్విన్, కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో 2022 జనవరిలో రెండు వన్డేలు ఆడాడు..