శ్రీలంకతో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (113) సెంచరీ చేయగా రోహిత్ శర్మ (83), శుభమన్ గిల్ (70) రాణించారు. ఆ తర్వాత భారత బౌలర్లు లంకను 306 పరుగులకే కట్టడి చేశారు. ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయింది. చివర్లో దసున్ శనక (108) మెరుపులు మెరిపించాడు.