INDvsENG 4th Test: మెరుపులు మెరిపించిన భారత బ్యాట్స్మెన్... ఇంగ్లాండ్ ముందు టార్గెట్ ఎంతంటే..
First Published Sep 5, 2021, 9:01 PM ISTనాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు 466 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ ముందు నాలుగో ఇన్నింగ్స్లో 367 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్లో చివరి మూడు వికెట్లను 1 పరుగు తేడాలో కోల్పోయిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్లో 52 పరుగులు జోడించడం విశేషం. శార్దూల్ ఠాకూర్ అద్భుత సెంచరీకి రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ, బుమ్రా, ఉమేశ్ యాదవ్ మెరుపులు తోడవడంతో రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేయగలిగింది భారత జట్టు.