వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ... ఆ ఇద్దరికీ నిరాశ...

First Published Mar 19, 2021, 10:50 AM IST

ఐదు మ్యాచుల టీ20 సిరీస్ తర్వాత ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్‌ కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ. 

బిజీ షెడ్యూల్ దృష్ట్యా వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు విశ్రాంతి కల్పిస్తారని వార్తలు వినిపించినా, అదేం జరగలేదు...
undefined
విరాట్ కోహ్లీని కెప్టెన్‌గానే కొనసాగించిన బీసీసీఐ, రోహిత్ శర్మను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఐపీఎల్ 2021 ముందు ఆడనున్న ఈ సిరీస్‌లోనూ పూర్తి జట్టుతో బరిలో దిగుతోంది టీమిండియా...
undefined
టీ20 సిరీస్‌కు ఎంపికైన సూర్యకుమార్ యాదవ్‌ను, వన్డే జట్టులో కూడా కొనసాగించిన టీమిండియా, ఇషాన్ కిషన్‌ను మాత్రం పక్కనబెట్టింది...
undefined
ఓపెనర్లుగా రోహిత్ శర్మతో పాటు శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్‌లను ఎంపిక చేసింది. వరుసగా ఫెయిల్ అవుతున్న కెఎల్ రాహుల్ కూడా వన్డే జట్టులో స్థానం సంపాదించుకున్నాడు...
undefined
ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాతో పాటు ఆయన సోదరుడు కృనాల్ పాండ్యాకు కూడా వన్డే టీమ్‌లో చోటు దక్కింది. వీరితో పాటు ప్రసిద్ధ్ కృష్ణకు టీమిండియా నుంచి పిలుపు దక్కింది...
undefined
యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ విభాగాన్ని నడిపిస్తుండగా నటరాజన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ పేస్ విభాగాన్ని నడిపిస్తారు...
undefined
విజయ్ హాజారే ట్రోఫీ 2021 వన్డే టోర్నీలో అద్భుతంగా రాణించిన పృథ్వీషా, దేవ్‌దత్ పడిక్కల్‌కు వన్డే టీమ్‌లో చోటు దక్కుతుందని ఆశించినా, వారికి నిరాశే ఎదురైంది...
undefined
మూడు వన్డేలకు భారత జట్టు:విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, చాహాల్, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్
undefined
click me!