ఏడాదంతా బాదుడే... క్రికెట్ ఫ్యాన్స్కి పండగే పండగ... 2021లో టీమిండియా ఫుల్లు బిజీ...
First Published Jan 6, 2021, 4:08 PM ISTకరోనా వైరస్ కారణంగా టీమిండియాకి దాదాపు ఏడు నెలల విశ్రాంతి లభించింది. లాక్డౌన్తో సర్వం నిలిచిపోవడంతో క్రికెటర్లు ఇంటికే పరిమితమయ్యారు. విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా లాంటి కొందరు ఈ లాక్డౌన్ని సరిగ్గా వాడుకుంటే, మరికొందరు ఇంట్లో పనులు చేస్తూ, టిక్టాక్ వీడియోలు చేస్తూ గడిపేశారు. అయితే ఈ ఏడాది అలా కాదు, సిరీస్ తర్వాత సిరీస్లతో 2021లో ఫుల్లు బిజీగా గడపబోతోంది టీమిండియా.