మొత్తం 8 జట్ల మధ్య జరిగే ఈ ఉత్కంఠభరిత పోరు టీ20 ఫార్మాట్లో సాగనుంది. ఈ టోర్నీ కోసం సెలెక్టర్లు సీనియర్ ఆటగాళ్లతో పాటు, డొమెస్టిక్ క్రికెట్లో రాణించిన పలువురు యువ ముఖాలకు కూడా జట్టులో చోటు కల్పించారు. జట్టు మెయిన్ బ్యాటింగ్ లైనప్లో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ఉన్నారు.
స్పిన్, ఆల్రౌండ్ బాధ్యతలను దీప్తి శర్మ, రాధా యాదవ్ చూసుకోనున్నారు. పేస్ బౌలింగ్ విభాగాన్ని రేణుకా ఠాకూర్ లీడ్ చేయనుంది. వీటితో పాటు డొమెస్టిక్ సర్క్యూట్లో అదరగొట్టిన జి. కమలిని, భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందిని శర్మలకు ఈ మెగా టోర్నీలో తమను తాము నిరూపించుకోవడానికి గోల్డెన్ ఛాన్స్ దక్కింది.