ఇంగ్లాండ్తో వన్డే, టీ20 సిరీస్ ఆడి స్వదేశానికి చేరుకుంది శ్రీలంక జట్టు. అలా వీళ్లు వచ్చారో లేదో, ఇంగ్లాండ్ జట్టులో ఏకంగా ఏడుగురికి కరోనా పాజిటివ్గా తేలింది...
undefined
స్వదేశానికి చేరుకున్న తర్వాత శ్రీలంక బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్తో పాటు డాటా అనాలసిస్టట్ జీటీ నిరోషన్కి కూడా కరోనా పాజిటివ్గా తేలింది.
undefined
ముందు జాగ్రత్తగా జట్టు మొత్తాన్ని క్వారంటైన్కి తరలించి, కరోనా పరీక్షలు నిర్వహించిందిశ్రీలంక టీమ్. ఇందులో ప్లేయర్లందరికీనెగిటివ్ వచ్చింది...
undefined
అయినా ముందు జాగ్రత్తగా వారం రోజుల పాటు క్వారంటైన్లో గడపనుంది లంక జట్టు. దాంతో జూలై 13న ప్రారంభం కావాల్సిన సిరీస్ను మరో నాలుగు రోజులు వాయిదా వేసి, జూలై 17న ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
undefined
షెడ్యూల్ ప్రకారం జూలై 13న ప్రారంభం కావాల్సిన మొదటి వన్డే 17న ప్రారంభం కానుంది.రెండో వన్డే 19న, మూడో వన్డే 21న జరుగుతాయి. ఆ తర్వాత జూలై 24న మొదటి టీ20, జూలై 25న రెండో టీ20, జూలై 27న మూడో టీ20 మ్యాచ్ జరుగుతాయి...
undefined
ఈ సిరీస్ కోసం 20 రోజుల ముందు నుంచే బయో బబుల్లో గడుపుతున్న భారత జట్టు, వన్డే సిరీస్ ఆరంభానికిమరో నాలుగు రోజుల పాటు ఎదురుచూడాల్సి వస్తోంది...
undefined
భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, ఈ సిరీస్కి కెప్టెన్గా వ్యవహరించబోతుండగా, భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేబడుతున్నారు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు...
undefined