షమీ త్వరలో బౌలింగ్ చేయడానికి రాకపోతే అది ఖచ్చితంగా భారత్కు పెద్ద దెబ్బ అవుతుంది. అతను మంచి స్పెల్ మధ్యలో ఉన్నాడు. తన స్పెల్ మూడో ఓవర్లో పాకిస్తాన్ ఓపెనర్లను కొంచెం ఇబ్బంది పెట్టాడు. అతను మైదానం నుండి బయటకు వెళ్లాల్సి వచ్చిన తర్వాత, రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాను బౌలింగ్ దాడిలోకి ప్రవేశపెట్టాడు. హర్దిక్ పాండ్యా తన బౌలింగ్ లో బాబార్ ఆజంను ఔట్ చేసి భారత్ కు బ్రేక్ త్రూ అందించాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా ఇమామ్ ను రనౌట్ చేసి భారత్ కు రెండో వికెట్ అందించాడు.
అయితే, కొంత సమయం తర్వాత షమీ మళ్లీ గ్రౌండ్ లోకి వచ్చాడు. షమీ ఆడటం భారత్ కు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రస్తుతం అతను అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసుకుని భారత్ విజయంలో కీతక పాత్ర పోషించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్-పాకిస్తాన్ జట్ల ప్లేయింగ్ 11 వీరే
భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్
పాకిస్తాన్ (ప్లేయింగ్ XI):
ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్, వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్