అసలు ఇండియా,పాక్ మధ్య వివాదమేంటి :
పాకిస్థాన్ ను ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనే విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. ఈ ఉగ్రవాదులను భారత్ పై ఉసిగొల్పి అల్లర్లు సృష్టించేలా ప్రతిసారీ కుట్రలు పన్నుతుంటుంది. ఇలా 2008 లో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ దాడులకు తెగబడి రక్తపాతం సృష్టించింది. ఈ ఉగ్రదాడి పాక్ పనే కావడంతో ఆ దేశాన్ని భారత్ దూరం పెట్టింది.
భారత్,పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలే కాదు క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతిన్నారు. భారత ప్రభుత్వం అంగీకరించకపోవడంతో 2008 నుండి ఇప్పటివరకు టీమిండియా పాక్ లో పర్యటించలేదు. పాకిస్థాన్ కూడా ఒకటిరెండుసార్లు ఐసిసి మ్యాచుల కోసం ఇండియాకు వచ్చింది. కానీ భారత ప్రభుత్వం మాత్రం పాకిస్థాన్ లో పరిస్థితుల నేపథ్యంలో ఆటగాళ్లను అక్కడికి పంపేందుకు అంగీకరించడం లేదు. క్రికెటర్లను పాక్ కు పంపొద్దని బిసిసిఐని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీపైనే నీలినీడలు కమ్ముకున్నాయి.
అయితే ప్రస్తుతం అన్ని దేశాల కంటే భారత క్రికెట్ బోర్డు అత్యధిక ఆదాయం కలిగివుంది... అలాగే ఐసిసిలో చాలా బలమైన బోర్డు ఇది. ఇక భారత్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ మ్యాచ్ అంటే కాసుల వర్షం ఖాయం. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ నుండి భారత్ తప్పుకుంటే అటు ఐసిసి, ఇటు పిసిబికి భారీ నష్టం తప్పదు.
ఒకవేళ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడబోమంటే ఆ టోర్నీని మరో చోటికి తరలించే కూడా ఐసిసి సిద్దపడుతుంది... ఇదే జరిగితే పిసిబికి ఏకంగా రూ.296 కోట్ల నష్టం వస్తుందని అంచనా. అందువల్లే టిమిండియా షరతులకు తలొగ్గింది పాక్. భారత్ ఆడే మ్యాచులను ఇతర దేశాల్లో నిర్వహించేందుకు సిద్దమయ్యింది.