జులై మొదటివారంలో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అక్కడ కరేబియన్ టీమ్ తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వెస్టిండీస్ తో టీ20 సిరీస్ లో చివరి రెండు మ్యాచ్ లు అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరుగుతాయి. ఆగస్టు 13న ఈ సిరీస్ ముగియనుంది.