ఈ నేపథ్యంలో ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో బంగ్లా సారథి షకిబ్ అల్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా.. ఇక్కడికి ప్రపంచకప్ నెగ్గడానికి వచ్చిందని, తాము మాత్రం అందుకు రాకపోయినా రోహిత్ సేనకు షాకిస్తామని హెచ్చరికలు జారీ చేశాడు. తమను తక్కువగా అంచనా వేస్తే ఫలితాలు తారుమారు అవుతాయని చెప్పాడు.