ఈ సిరీస్లోని 4 ఇన్నింగ్స్ల్లోనూ దినూష 50కి పైగా పరుగులు (100, 84, 103, 133 నాటౌట్) సాధించాడు. భారత్పై తన కెరీర్ మొదటి 4 టెస్టు ఇన్నింగ్స్ల్లో 50+ పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్గా నిలిచాడు. ఇతని ఆటతీరు చూసి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సోషల్ మీడియా ఎక్స్ లో ప్రశంసలు కురిపించారు. "దినూష ఆడుతుంటే సచిన్ టెండూల్కర్ను చూసినట్లుగా ఉంది. ఇతను అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో గొప్ప ప్లేయర్ అవుతాడు" అని కొనియాడారు.
సంక్షిప్త స్కోర్లు
• భారత్ తొలి ఇన్నింగ్స్: 503/9 డిక్లేర్డ్ (138 ఓవర్లు)
• శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 290
• శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (ఫాలో ఆన్): 429/9 డిక్లేర్డ్ (154 ఓవర్లు) - (సోనాల్ దినూష 133 నాటౌట్, పసిందు సూర్యబండార 92; మానవ్ సుతార్ 3-105, రవీంద్ర జడేజా 3-94)
• ఫలితం: మ్యాచ్ డ్రా (భారత్ 1-0తో సిరీస్ విజేత)