జైస్వాల్, గిల్ తుఫాను ఇన్నింగ్స్..
ఓపెనర్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ (40 పరుగులు), శుభ్మన్ గిల్ (34 పరుగులు) భారత్ కు శుభారంభం అందించారు. తొలి వికెట్కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. గిల్, జైస్వాల్ ఇద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేసి శ్రీలంక బౌలర్లను చిత్తు చేశారు. జైస్వాల్ 190.47 స్ట్రైక్ రేట్తో 40 పరుగులు చేశాడు. 21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. గిల్ 212.50 స్ట్రైక్ రేట్ తో తన 16 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 34 పరుగులు చేశాడు.