భారత్ నుంచి మ్యాచ్ ఎలా చేజారింది?
స్వల్ప లక్ష్యం కావడంతో సౌతాఫ్రికా ఈజీగానే గెలిచేలా కనిపించింది. అయితే, భారత్ స్పిన్నర్లు సూపర్ బౌలింగ్ తో మ్యాచ్ ను భారత్ వైపు తీసుకువచ్చారు. మ్యాచ్ లో భారత్ పై చేయి సాధించడంలో విజయవంతం అయ్యారు. 86 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా కష్టాల్లో పడేలా చేశారు. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ లకు తోడుగా అక్షర్ పటేల్ లు తమ స్పిన్ మాయాజాలంతో సౌతాఫ్రికాను దెబ్బకొట్టారు.
అయితే, డెత్ ఓవర్లలో భారత పేసర్లు భారీగా పరుగులు ఇచ్చుకోవడంతో టీమిండియా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ముఖ్యంగా అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అవేష్ ఖాన్ లు భారీగా పరుగులు ఇవ్వడం భారత్ కొంప ముంచింది.